Tuesday, May 14, 2024

ప్యాసింజర్‌ కార్ల రేట్లు పెంచిన టాటా..

ముడి సరుకుల ధరలు పెరగడంతో ప్యాసింజర్‌ వాహనాల ధరలు పెంచుతున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఈ పెంపుదల వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. అన్ని రకాల ప్యాసింజర్‌ కార్లపై 0.55 శాతం రేట్లు పెంచుతున్నామని, ఇది శనివారం నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. ముడిసరకుల ధరలు భారీగా పెరిగాయని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇందులో స్వల్ప మొత్తాన్ని వినియోగదారులపై వేయక తప్పలేదని టాటా మోటార్స్‌ తెలిపింది. ప్యాసింజర్‌ కార్లలో ప్రధానంగా టాటా పుంచ్‌, నెక్సన్‌, హరియర్‌, సఫారీ, టిగోర్‌ వంటివి ఉన్నాయి. ఈ నెలలో టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరలను 1.5 నుంచి 2.5 శాతానికి పెంచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement