Sunday, April 28, 2024

లాభాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం లాభాలతో ప్రారంభమయి..నిలకడగా కొనసాగుతున్నాయి..అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి అమెరికా మార్కెట్ల లాభాల ముగింపుతో పాటు ఆసియా మార్కెట్ల సానుకూల ధోరణి దేశీ మార్కెట్ల పై ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్‌ 248 పాయింట్ల లాభంతో 52,620 వద్ద నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 15,767 వద్ద కొనసాగుతున్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్​, మహీంద్రా అండ్​ మహీంద్రా, ఎన్​టీపీసీ, మారుతి సుజూకి ఇండియా, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాలు పొందాయి. టెక్​ మహీంద్రా, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్​ ఐటీ కంపెనీలు నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: స్థిరంగా పెట్రో ధరలు.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement