Tuesday, May 7, 2024

లాభాలతో ప్రారంభమయిన మార్కెట్లు..

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమైయ్యాయి. అంతర్జాతీయ వ్యాప్తంగా సానుకూల సంకేతాలు రావడంతో వరుస నష్టాలనుంచి తేరుకున్నాయి సూచీలు. అంతేకాదు ప్రారంభమయిన కాసేపటికి షేర్లు ఎగిసి ఉత్సాహంగా కొనసాగుతునన్నాయి. సెన్సెక్స్‌ 336 పాయింట్లు పెరగడంతో 50వేల105 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు జంప్‌ చేసి  14835 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు  అన్ని రంగాల్లోనూ  కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా  బ్యాంకింగ్‌, ఆటో రంగ లాభాలు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. అదానీ పోర్ట్స్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్,టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లోనూ, ఐఓసీ, పవర్ గ్రిడ్, బ్రిటానియా,ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్  నష్టాల్లోనూ ట్రేడ్ ‌అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement