Monday, April 29, 2024

ఎన్‌డీటీవీలో వాటాల కొనుగోలు.. అక్టోబర్‌ 17నుంచి అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌

ఎన్‌డీటీవీలో 28 శాతం అదనపు వాటాల కొనుగోలుకు సంబంధించి అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ అక్టోబర్‌ 17న ప్రారంభమైన నవంబర్‌ 1న ముగుస్తుందని జేఎం ఫైనాన్షియల్‌ గురువారం ప్రకటించింది. ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా ఒక్కో షేరు రూ.294 చొప్పున 1.67 కోట్ల ఈక్విటీ షేర్లను ఆదానీ గ్రూప్‌ కొనుగోలు చేస్తుంది. పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయితే ఓపెన్‌ ఆఫర్‌ విలువ రూ.492.81 కోట్లు అవుతుందని తెలిపింది.

ఎన్‌డీటీవీలో మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్నట్లు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ ఆగస్టు 23న ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన విశ్వప్రదాన్‌ కమర్షియల్‌ (వీసీపీఎల్‌)కు చెల్లించిన రుణాన్ని ఎన్‌డీటీవీలో 29.18 శాతం వాటాగా అదానీ గ్రూప్‌ మార్చుకుంది. అదానీ గ్రూప్‌ ప్రకటనతో వరుసగా దూసుకెళ్లిన ఎన్‌డీటీవీ షేరు, గురువారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో 5శాతం క్షీణించి రూ.468 వద్ద ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement