Tuesday, April 23, 2024

ఎల్‌ఐసీ ‘ న్యూ పెన్షన్‌ ప్లస్‌ ‘

భారతీయ జీవితబీమా సంస్థ సరికొత్త పెన్షన్‌ పథకాన్ని తీసుకొచ్చింది. న్యూ పెన్షన్‌ ప్లస్‌ పేరుతో నాన్‌ పార్టిసిపేటింగ్‌, యూనిట్‌-లింక్‌డ్‌ పెన్షన్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది క్రమబద్ధమైన, క్రమశిక్షణతో కూడిన పొదుపు ద్వారా కార్పస్‌ను నిర్మించడంలో సహాయపడుతుంది. నిబంధనలు పూర్తిచేసిన తర్వాత, యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఇది సాధారణ ఆదాయంగా మారుతుంది. కొత్త పెన్షన్‌ ప్లాన్‌ సెప్టెంబర్‌ 5నుంచి అమల్లోకి వచ్చిందని ఎల్‌ఐసీ ట్వీట్‌లో పేర్కొంది. దీనిని ఒకే ప్రీమియం చెల్లింపు లేదా సాధారణ ప్రీమియం చెల్లింపుగా కూడా కొనుగోలుచేయవచ్చు. సాధారణ పాలసీ ప్రకారం పాలసీ వ్యవధిలో మొత్తం చెల్లించబడుతుంది.

పాలసీ టర్మ్‌, వెస్టింగ్‌ వయసు పరిమితులకు లోబడి చెల్లించాల్సిన ప్రీమియంను, పాలసీ వ్యవధిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి కొనుగోలు చేసిన పాలసీని అదే నిబంధలతో సంచిత వ్యవది లేదా వాయిదా వ్యవధిని పొడిగించే ఎంపిక కూడా అందుబాటులో ఉంది. యువకులు పదవీ విరమణ అనంతర జీవితానికి కేటాయింపులు చేయడానికి ఇది సరైన ప్లాన్‌ అని ఎల్‌ఐసీ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement