Monday, May 20, 2024

Oppo A79 5G | 50 ఎంపీ కెమెరాతో ఒప్పో కొత్త ఫోన్‌

చైనా మొబైల్‌ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ79 5జీ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 50ఎంపీ ప్రధాన కెమెరాతో దీన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ఒప్పో ఏ79 5జీ స్మార్ట్‌ఫోన్‌ 8జీబీ,128 జీబీ వేరియంట్‌తో వస్తోంది. దీని ధర రూ.19,999. గ్లోయింగ్‌ గ్రీన్‌, మిస్ట్రీ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. 6.72 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమోల్డ్‌ డిస్‌ప్లేను అమర్చారు.

మీడియాటెక్‌ 6020 ప్రాసెసర్‌తో ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత కలర్‌ ఒఎస్‌13తో ఈ మొబైల్‌ పనిచేస్తుంది. 50 ఎంపీ ఏఐ ప్రధాన కెమెరాకు 2 ఎంపీ పోర్ట్రెయిట్‌ కెమెరా ఇచ్చారు. సెల్ఫీ, వీడియోకాల్స్‌ కోసం ముందువైపు 8 ఎంపీ కెమెరా అమర్చారు. 5,000ఎంయాంప్స్‌ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్‌ 33వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement