Wednesday, May 15, 2024

TS B.ed | తుది విడతలో 6,223 బీఎడ్‌ సీట్లు కేటాయింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీఎడ్‌ తుది విడత సీట్లను అభ్యర్థులకు అధికారులు కేటాయించారు. మొత్తం 9593 కన్వీనర్‌ కోటా సీట్లకుగానూ 6223 సీట్లను కేటాయించినట్లు కన్వీనర్‌ ప్రొ.పి.రమేష్‌ బాబు తెలిపారు. బీఎడ్‌ సీట్ల కోసం తుది విడతలో 8338 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్‌ చేసుకోగా అందులో 6223 మంది సీట్లు దక్కించుకున్నారు. సీటు పొందిన అభ్యర్థులు ఆయా కళాశాలల్లో ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్‌ 4వ తేదీ వరకు రిపోర్టింగ్‌ చేయాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే మొదటి విడతలో 9417 సీట్లను కేటాయించగా అందులో 4674 మంది అభ్యర్థులు మాత్రమే ఇప్పటి వరకు కళాశాలల్లో రిపోర్టింగ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement