Monday, April 29, 2024

Bhadrachalam – బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్య స్వల్ప తోపులాట

భద్రాచలం (టౌన్) అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ): పట్టణంలోని ఆదివారం సుభాష్ నగర్ కాలనీలో ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియా పట్టణ సమస్యలపై ఒక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావుతో పాటు ఆ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పోదెం వీరయ్య అందుబాటులో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సరెళ్ల నరేష్ తో ఆ పార్టీ పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా తెల్లం వెంకట్రావు భద్రాచలం అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, స్థానికుడు నైనా తనను గెలిపించాలని ప్రసంగించారు. ఆ సందర్భంలో సరెళ్ల నరేష్ కలగజేసుకొని పట్టణ అభివృద్ధి పై ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా ఇరు పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది…. అది కాస్త ముదిరి స్వల్ప తోపులాటకి దారితీసింది. సమాచారం తెలుసుకున్న పట్టణ సిఐ నాగరాజు రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఇరు పార్టీ నాయకులకు నచ్చజెప్పి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement