Saturday, May 4, 2024

ఫోన్‌ పే లో రోజుకు 10 మిలియన్లకు పైగా లావాదేవీలు

హైదరాబాద్‌, (ప్రభన్యూస్‌) : ఒకే రోజున 10 మిలియన్లకు పైగా లావాదేవీలను ప్రాసెస్‌ చేశామని భారతదేశపు అగ్రగామి డిజిటల్‌ పేమెంట్ల యాప్‌ ఫోన్‌ పే ప్రకటించింది. తమరంగంలో అత్యధిక వినియోగ సేవల విజయవంతమైన రేట్ల నేపథ్యంలో తాము ఈ అసాధారణమైన మైలురాయిని సాధించగలిగామని తెలిపింది. ఈమైలురాయి గురించి ఫోన్‌ పే సీటీ ఓ, సహ స్థాపకుడు రాహుల్‌ చారి మాట్లాడుతూ… ఇది తమకు పెద్ద మైలురాయి అన్నారు.

అత్యుత్తమ నాణ్యత కలిగిన పేమెంట్ల విజయవంత రేట్లు-, అత్యంత వేగవంతమైన లావాదేవీ మెరుగైన ఉత్పత్తి అనుభవంతో దీన్ని సాధించామన్నారు. చారిత్రక ప్రవర్తన ప్రాతిపదికన లావాదేవీ విజయవంతమయ్యే పరిస్థితిని ముందుగానే ఊహించేందుకు తాము సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. 99.99శాతం సిస్టం అప్ టైమ్‌ అందించడానికి మమ్మల్ని అనుమతిస్తుందన్నారు. కోట్లాది మంది భారతీయులకు ఒక పేమెంట్ల వేదికను నిర్మించడానికి తమ కృషిని ఇలాగే కొనసాగిస్తామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement