Sunday, May 5, 2024

క్రిప్టోతో మనీలాండరింగ్‌, నియంత్రణ వ్యవస్థ కీలకం.. అన్ని దేశాలు కలిస్తేనే టెక్నాలజీ

క్రిఎ్టోలను మనీ లాండరింగ్‌, ఉగ్రవాదులకు నిధులు సమీకరించేందుకు ఉపయోగించే ముప్పు పొంచి ఉందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. క్రిఎ్టోలతో అన్ని దేశాలకు ఉన్న అతిపెద్ద ముప్పు ఇదే అని, మనీలాండరింగ్‌, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించేందుకు ఈ కరెన్సీని ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్‌ అమెరికా పర్యటనలోని ఓ సెమినార్‌లో పాల్గొని మాట్లాడారు. క్రిఎ్టో కరెన్సీ విషయంలో ఈ సమస్య పరిష్కరించేందుకు టెక్నాలజీతో కూడిన నియంత్రణ అవసరమని భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.

ఇది కేవలం ఏ ఒక్క దేశమో నిర్వహించడం అసాధ్యమని, బోర్డులోని అన్ని దేశాలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత్‌లో టెక్నాలజీ వినియోగం గురించి కేంద్ర మంత్రి ప్రస్తావించారు. కరోనా సమయంలో భారత్‌లో సాంకేతికత వినియోగం భారీగా పెరిగిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రేటు 64 శాతంగా ఉందని చెప్పుకొచ్చారు. భారత్‌లో మాత్రం టెక్నాలజీ వినియోగం 85 శాతానికి చేరుకుందని వివరించారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంపైన కూడా ఆమె స్పందించారు. శ్రీలంకకు అన్ని విధాలుగా భారత్‌ నుంచి సహకారం ఉంటుందని ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement