Sunday, May 5, 2024

అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గడికోట శ్రీకాంత్​రెడ్డి

అన్నమయ్య ప్రతినిధి, ప్రభన్యూస్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించింది. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా వైసిపి అధ్యక్షుడిగా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందినట్లు తెలుస్తోంది. గడికోట శ్రీకాంత్ రెడ్డి సీనిర్ ఎమ్మెల్యేగా పార్టీలో సముచిత స్థానం ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ చీఫ్ విప్ మూడేళ్ల పాటు కొనసాగారు. అంతకుముందు రాయచోటిలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

2009, 2012(ఉప ఎన్నికలు) , 2014 , 2019 ఎన్నికలలో వరుసగా విజయం సాధించి రాయచోటిలో రికార్డ్ సృష్టించారు. పార్టీ అధినేత, సీఎం జగన్ కు నమ్మినబంటుగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. దీంతో అధినేత నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు శ్రీకాంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది. అధినేతకు విధేయుడుగా ,పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన శ్రీకాంత్ రెడ్డికి జిల్లా బాధితులు అప్పగించడంతో ఆయన అభిమానుల్లో, వైసీపీ శ్రేణుల్లో సందడి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement