Friday, May 3, 2024

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిసాయి.  ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 562 పాయింట్ల నష్టంతో 49,801కి పడిపోయింది. నిఫ్టీ 189 పాయింట్లు కోల్పోయి 14,721కి దిగజారింది.  రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏసియన్ పెయింట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, భారతి ఎయిర్ టెల్ వంటి దిగ్గజ కంపెనీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టపోయాయి. దాదాపుగా అన్ని కంపెనీలు రెడ్ లోనే ట్రేడ్ అయ్యాయి. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఆటో కంపెనీలు బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. సెన్సెక్స్ లో కేవలం ఐటీసీ, ఇన్ఫోసిస్ మాత్రమే లాభపడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement