Monday, April 29, 2024

భారతదేశంలో వెబ్‌3 ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్న కాయిన్‌స్విచ్‌..

ప్రభన్యూస్ : భారతదేశంలో క్రిఎ్టో పెట్టుబడుల్లో అత్యంత పెద్ద యాప్‌ కాయిన్‌స్విచ్‌ 2022 ఏడాది చివరికి తన ఉద్యోగుల సంఖ్యను 1000కు పెంచుకునేందుకు ప్రణాళిక రూపొందించుకుంది. ఈసందర్భంగా కాయిన్‌స్విచ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆశిశ్‌ సింఘాల్‌ మాట్లాడుతూ… దేశంలో నూతన ఇంటర్నెట్‌ వేవ్‌ కొనసాగుతోందన్నారు. భారీ సాంకేతికత కలిగిన కంపెనీలను వెబ్‌3లో నిర్మించుకునేందుకు అవకాశముందన్నారు. భారతదేశంలో ప్రతిభా సంపదకు కొరత లేదన్నారు.

తాము అత్యుత్తమ సేవలందించే వారిని నియమించుకుంటూ, వారిని భారతదేశంలో అత్యంత పెద్ద వెబ్‌3 స్పెషలిస్ట్‌ల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. దీనిపట్ల ఆసక్తి ఉన్న వారిని నియమించుకుని, శిక్షణ ఇస్తూ, వారిని భవిష్యత్తు అవసరాల కోసం తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement