Saturday, May 4, 2024

బిగ్‌సి దసరా ధమాకా ఆఫర్‌..

హైదరాబాద్‌: గత రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో మొబైల్‌ రీటైల్‌ విక్రయంలో చరిత్ర సృష్టిస్తున్న బిగ్‌ సి సంస్థ దసరావళి డబుల్‌ ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో 250కిపైగా స్టోర్ల ద్వారా మొబైల్‌ విక్రయాలు చేస్తున్నామని, దసరావళికి బంపర్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను తీసుకొచ్చామని సంస్థ ఫౌండర్‌, సీఎండీ యం.బాలు చౌదరి చెప్పారు. డబుల్‌ ధమాకా ఆఫర్‌లో భాగంగా ప్రతి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపుై రూ.1999 విలువైన ఇన్‌బేస్‌ ఇయర్‌బడ్స్‌ను కేవలం రూ.199కి లేదా రూ.3999 విలువగల గిజ్‌మోర్‌ కాలింగ్‌ స్మార్ట్‌వాచ్‌ను కేవలం రూ.899కి అందిస్తున్నామని వివరించారు. అలాగే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.3000 వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నామని తెలిపారు

ల్యాప్‌టాప్‌ కొనుగోలుపై రూ.3వేల తక్షణ డిస్కౌంట్‌తోపాటు ల్యాప్‌ట్యాప్‌ బ్యాగ్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. బ్రాండెడ్‌ యాక్సెసరీస్‌పై 51శాతం డిస్కౌంట్‌ను ప్రకటించారు, ఐఫోన్స్‌పై రూ.5 వేల క్యాష్‌బ్యాక్‌, సామ్‌సంగ్‌ మొబైల్స్‌పై 10 వేల వరకు క్యాష్‌బ్యాక్‌, వన్‌ప్లస్‌ మొబైల్స్‌పై రూ.6000 డిస్కౌంట్‌ ఇస్తున్నామని అన్నారు. అలాగే ఏటీఎంకార్డుపై ఎలాంటి డౌన్‌పేమెంట్‌ లేకుండానే మొబైల్‌, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌టీవీలు కొనుగోలుచేసే ఆకర్షణీయ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆఫర్లను వినియోగదారులు ఉపయోగించుకోవాలని బాలుచౌదరి సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement