Wednesday, May 15, 2024

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఆదాయంలో 150శాతం వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఏకీక్సత ప్రాతిపదికన ఒలెక్టా గ్రీన్‌టెక్‌ ఆదాయం ఆకర్షణీయంగా పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.183.27 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే కాలం ఆదాయం రూ.73 కోట్లతో పోలిస్తే 150 శాతానికి పైగా పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా సెప్టెంబరు త్రైమాసికంలో నికర లాభం రూ.3.6 కోట్ల నుంచి రూ.7.41 కోట్లకు చేరిందని తెలిపింది. ప్రథమార్ధంలో మొత్తం 280 ఎలక్ట్రిక్‌ బస్సులను కంపెనీ సరఫరా చేసిందని ఒలెక్టా గ్రీన్‌టెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీ ప్రదీప్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement