Saturday, April 27, 2024

YSRCP – ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ స‌భ‌లు

3,4 తేదీల‌లో నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు
సిద్ధం స‌భ పోస్ట‌ర్ ఆవిష్క‌రించిన పెద్దిరెడ్డి
రాష్ట్రంలో 21 ప్రాంతాల‌లో సిద్దం స‌భ‌లు
త్వ‌ర‌లోనే షెడ్యూల్ విడుద‌ల
వెల్ల‌డించిన మంత్రి పెద్దిరెడ్డి

రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో – ఏప్రిల్ 3,4 తేదీలలో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సిఎం జగన్ పాల్గొనే మేమంతా సిద్దం సభలు జరుగుతాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. చిత్తూరు లేదా పూతలపట్టు లో ఒక సభ, నాయుడుపేట లేదా శ్రీకాళహస్తి లో సభలు నిర్వహిస్తామని చెప్పారు. తిరుపతి నేడు జ‌రిగిన‌ “మేమంతా సిద్దం” సమన్వయ సమావేశం లో ఎమ్మేల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం సమన్వయకర్తలకు పాల్లొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో కలిసి సిద్దం సభ పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.

అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 21 సభలు నిర్వహిస్తామన్నారు. ఈనెల 27 ప్రొద్దుటూరు, 28 నంద్యాల, 29 ఎమ్మిగనూరు లో సమావేశం నిర్వహించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సిద్దం సభలు నిర్వహించిన నాలుగు ప్రాంతాలు మినహాయించి మిగిలిన 21 జిల్లాలో సభలు జరుగుతాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement