Friday, April 26, 2024

Breaking: సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. అసలు సినిమా వారికి ఏపీ అంటే గుర్తుందా? అని ప్రశ్నించారు. టిక్కెట్ రేట్లు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని, ప్రభుత్వ నిర్ణయంలో తప్పేంటని ఆయన ప్రశ్నించారు. సినిమా వాళ్లంతా హైదరాబాద్‌లో ఉన్నారని, వారికి ఏపీ కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉండి అక్కడ సినిమాలు తీస్తున్న సినీ హీరోలు కోట్లకు కొట్లు సంపాదిస్తున్నారన్నారు. సినిమా హీరోలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని.. టికెట్ రేటు తగ్గించి పేదవాడు సినిమా చూసేలా చేయడం తప్పా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదని.. అందుకే ముఖ్యమంత్రి జగన్ సినిమా టికెట్ల రేట్లు తగ్గించారన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని సినిమాలు తీసుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

సినిమా టికెట్ల ధరలు తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు గ్యాప్ ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయం పలువురు సెలిబ్రిటీలు సైతం వ్యతిరేకించారు. హీరో నాని, నిఖిల్ సహా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఏపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement