Saturday, April 27, 2024

గుంటూరు ఘటనపై సీఎం ఆరా.. బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటనపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘దిశ’ కింద వేగంగా చర్యలను తీసుకుని దోషికి కఠినశిక్ష పడేలా చేయాలన్నారు. ఘటన వివరాలు తెలియగానే హోంమంత్రి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారని, ఆ కుటుంబానికి అండగా నిలబడతామంటూ భరోసా ఇచ్చిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని., పరిహారంగా రూ.10లక్షలు ఆకుటుంబానికి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

గుంటూరు జిల్లా కాకాణిలో జరిగిన ఘటన దురదృష్టకరమని సీఎం జగన్ అన్నారు. విద్యార్థిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఋ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసి, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ సీఎం ఇచ్చారు.

ఇది కూడా చదవండిః గుంటూరు జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థిని హత్య

Advertisement

తాజా వార్తలు

Advertisement