Thursday, April 25, 2024

గుంటూరు జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థిని హత్య

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుంటూరు నగరంలోని కాకాని రోడ్డులో బీటెక్ యువతి దారుణ హత్యకు గురైంది. విద్యార్థినిని కత్తితో పొడిచి దుండగుడు హత్య చేశాడు. బాధిత యువతి రమ్య ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీటెక్ మూడో ఏడాది చదువుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: ముగ్గురి ప్రాణం తీసిన కల్తీ మద్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement