Tuesday, April 30, 2024

కోడుమూరులో నారా లోకేష్ కు నిరసన సెగ


కర్నూలు – యువగళ యాత్రలో భాగంగా కోడుమూరులో పర్యటిస్తున్న నారా లోకేష్ కు వైయస్సార్సీపి శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. బుధవారం కోడుమూరు పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర వెళ్తున్న నారా లోకేష్ దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దళితులకు క్షమాపణ చెప్పే వరకు యువగళ యాత్ర సాగనివ్వమన్నారు. నిరసన వ్యక్తం చేసిన సుధాకర్ తో పాటు, దళిత నాయకులను అరెస్టు చేసి పోలీసులు నాగలాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement