Monday, April 29, 2024

వైసీపీ నాయకుల వేధింపులు..ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం

అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు ఓ ఆశా వర్కర్ పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆశా వర్కర్ ను తమ వద్ద పడుకోవాలంటూ బెదిరింపులు, వేధింపులకు గురి చేయసాగారు. ఆదినారాయణ, వరదప్ప, రామచంద్ర, సురేష్ అనే వ్యకుల తనను బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది సదరు ఆశ వర్కర్. తాను ఇచ్చిన కంప్లైంట్ పై పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ఆశ వర్కర్ చెబుతోంది. వైసీపీ నాయకులు నిత్యం తనను వేధింపులకు గురి చేసే వారిని ఆమె వాపోతోంది. ప్రస్తుతం ఆశా వర్కర్ అనంతపురం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement