Wednesday, May 8, 2024

చంద్ర‌బాబుతో యార్ల‌గ‌డ్డ భేటి … 22న లోకేష్ స‌మ‌క్షంలో టిడిపిలో చేరిక

హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబును కేడీసీసీ మాజీ ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు హైదరాబాద్‌లో కలిశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడారు. టిడిపిలో చేరడానికి సమ్మతి తెలిపినట్లు ఆయన చెప్పారు. పార్టీ అధినేత ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. గన్నవరం నుంచి టిడిపి సీటు ఆశిస్తున్న యార్లగడ్డ.. ఈ నెల 22న లోకేశ్‌ సమక్షంలో పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు స‌మాచారం..

కాగా, 2019లో గ‌న్న‌వ‌రం నుంచి వైసిపి అభ్య‌ర్థిగా పోటీ చేసిన యార్ల‌గ‌డ్డ టిడిపి అభ్య‌ర్ధి వంశీ చేతిలో ఓడిపోయారు.. ఆ త‌ర్వాత వంశీ వైసిపిలో చేర‌డంతో యార్ల‌గ‌డ్డ కినుక వ‌హించారు.. వైసిపి అధినాయ‌క‌త్వం నుంచి భ‌రోసా ల‌భించ‌క‌పోవ‌డంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు.. తాజాగా ఆయ‌న టిడిపి లో చేర‌నున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement