Friday, May 10, 2024

ఓటువేద్దాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం – జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్

సంగారెడ్డి, ఆగస్టు 20 (ప్రభ న్యూస్) ఓటు హక్కు గల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ కె.అనుదీప్ సంగారెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు మన ఆయుధం. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకున్ని ఎన్నుకుందామని పిలుపు నిచ్చారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని కోరారు. ఈనెల 26, 27, సెప్టెంబర్ 2, 3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఉందని, ఓటరు జాబితాలో తమ పేర్లు సరిచూసుకోవాలని, అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement