Sunday, April 28, 2024

కేసీఆర్ పాలనలో దళిత గిరిజన బీసీ మైనార్టీ మహిళలకు రక్షణ కరవు : ప్రవీణ్ కుమార్..

ఎల్బీనగర్ ఆగస్టు 20 (ఆంధ్ర ప్రభ): ఒంటరి మహిళను ఆక్రమంగా నిర్బంధించి పోలీసులు లాఠీలతో విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన దురదృష్టకరం. బహుజన సమాజ్ పార్టీ ఈ ఘటనను ఖండిస్తుందని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎల్బీనగర్ పోలీసులు చేతిలో గాయపడ్డ గిరిజన మహిళ బాధితురాలు లక్ష్మీ ని హస్తినపురం లోని శ్యామ్ హాస్పిటల్ లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , లక్ష్మి చెయ్యని నేరానికి పోలీస్ లు స్టేషన్ కి తీసుకొని వెళ్ళి కొట్టి 3 లక్షల రూపాయలు మరియు బంగారం తీసుకోవడం పోలీసులే దొంగలుగా వ్యవహరించారని దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కూతురు పెళ్లి ఉందని చెప్పిన కనికరం లేకుండా పోలీసులు వ్యవహరించడం బాధాకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పాలనలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరిగాయని గుర్తుచేశారు,మంత్రి సబితా ఇ0ద్రారెడ్డి వచ్చి పరామర్శించి ఒక ప్లాట్ ఇస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

,హోమ్ మంత్రి మహ్మద్ అలిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదకపోవడమేమిటని అన్నారు. ప్రవీణ్ కుమార్,అదే విధంగా బాధితురాలు లక్ష్మీ ను విచక్షణ రహితంగా కొట్టిన పోలీస్ లని ప్రాసిక్యూషన్ చేయాలని వారిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు, దళిత గిరిజన మైనారిటీ బీసీ మహిళలకు ముఖ్యమంత్రి కెసిఆర్ బారాసా ప్రభుత్వo లో రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధితురాలి కి కోటి రూపాయల న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement