Thursday, May 2, 2024

Yanamala: ఏపీలో ఆర్థిక సంక్షోభం

వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభం నెలకొందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ అహంభావం, చేతగానితనం, మొండితనంతోనే ఈ అనర్ధం జరిగిందని మండిపడ్డారు. బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మూడేళ్లలో టీడీపీ హయాం కంటే రూ.86,865 కోట్లు అధికమని తెలిపారు. కేంద్ర నిధులు కూడా కలిపితే రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ.1,25,995 కోట్లు ఎక్కువ వచ్చిందని చెప్పారు.

ఆదాయంలో అనేక రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని యనమల చెప్పారు. పనితీరులో, వివిధ శాఖల పురోగతిలో మాత్రం అట్టడుగున ఉందని విమర్శించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్ ప్రభావం ఏపీపై తక్కువే అని యనమల పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)లో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 19వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేసిన మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 20వ స్థానంలో ఉందని చెప్పారు. వివిధ శాఖలకు అసెంబ్లీ ఆమోదం పొందిన బడ్జెట్ కేటాయింపులను గాలికి వదిలేశారని యనమల ధ్వజమెత్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement