Thursday, April 18, 2024

Mulugu: బీరుసీసా పేలి ఆర్టీసీ డ్రైవ‌ర్ కు తీవ్రగాయాలు

బీరు సీసా పేలి టీఎస్ఆర్టీసీ డ్రైవర్ కు తీవ్ర గాయాలైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రంలో జరిగింది. నిన్న సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను తాడ్వాయికి తరలించిన తర్వాత బస్సును బస్టాప్ లో ఆపాడు డ్రైవర్. అనంతరం పక్కన ఉన్న వైన్ షాపులో బీరు కొనుగోలు చేసి బొడ్లో పెట్టుకుని వెళ్తుండగా బాటిల్ పేలిపోయింది. దీంతో, ఆయన పొట్ట భాగంలోకి గాజు ముక్కలు దూసుకుపోయి, పేగులు బయటకు వచ్చాయి. సహచర డ్రైవర్లు అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో హైదరాబాదుకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement