Sunday, April 28, 2024

నారు నాటుతుండగా వజ్రం దొరికింది..ఆరు లక్షలకు అమ్మిన మహిళా..

కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో నిన్న ఓ మహిళా కూలీకి ఖరీదైన వజ్రం లభించింది. టమాటా నారు నాటుతున్న కూలీ చేతికి చిక్కిన ఈ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ. 6 లక్షలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జొన్నగిరిలో ఇటీవల ఓ రైతుకు దొరికిన వజ్రం రూ. 1.25 కోట్లకు అమ్ముడుపోయింది.

ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు జొన్నగిరి చుట్టుప్రక్కల పొలాలు జాతరను తలపిస్తాయి. జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, పెరవలి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. పొలాల్లో ఎప్పటినుంచే వజ్రాలు దొరుకుతుండటంతో స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ వజ్రాల వేటలో మునిగి తేలుతుంటారు. గతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ తవ్వకాలు జరిపేవారు. ఇప్పుడు స్థానికులే ఆ పని చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement