Sunday, April 28, 2024

శ్రీశైలం జలశయానికి భారీగా ఇన్ ఫ్లో..

ఈ సీజన్ లో తొలిసారిగా శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ఇప్పటికే పూర్తిగా నిండిపోగా, కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలానికి నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో  44,554 క్యూసెక్కులుగా ఉండగా,  ఔట్ ఫ్లో నిల్‌గా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను…ప్రస్తుతం 821.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 41.7622 టీఎంసీలుగా ఉంది. ఇక, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 821.30 అడుగులకు నీరు చేరుకుంది. రిజర్వాయర్ లో 41 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు  పెరుగుతోంది. మరోవైపు కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement