Monday, May 6, 2024

అప్పుల బాధతో మహిళ రైతు ఆత్మహత్య..

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ మహిళ రైతు ఆత్మహత్య చేసుకుంది. ఆలూరు నియోజక పరిధిలోని హాలహర్వి మండలం కామినహల్ గ్రామానికి చెందిన వరలక్ష్మి మహిళ రైతు 15 ఏకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశారు. అయితే, వర్షాలు,తామర పురుగు ప్రభావంతో  మిరపపంట నాశనం అయ్యింది. దీంతో 15 లక్షలు అప్పు వరకు అయింది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్సీపీ నేత గుమ్మనూరు నారాయణస్వామి ఆ మహిళ రైతు కుటుంబం పరామర్శించారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement