Thursday, May 2, 2024

పంజాబ్‌లో ఆప్‌ విజ‌యం.. కేజ్రీవాల్‌ను ప్రశంసించిన క‌మ‌ల్ హసన్

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సినీన‌టుడు క‌మ‌లహాస‌న్ కూడా కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.

”ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్ కు, ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్ష‌లు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలోనే మరో రాష్ట్రం పంజాబ్‌లోనూ విజయం సాధించడం ప్ర‌శంస‌నీయం” అని కమలహాసన్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement