Friday, April 26, 2024

Breaking: ఆర్టీసీ బ‌స్సుకు త‌ప్పిన ప్ర‌మాదం

ప్ర‌యాణీకుల‌తో వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సుకు పెనుప్ర‌మాదం త‌ప్పిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆకివీడు శివారు అజ్జమూరు వద్ద ఆర్టీసీ బస్సుకు తృటిలో పెనుప్రమాదం తప్పింది. నర్సాపురం నుంచి ఏలూరు వెళుతుండగా బస్సుకు వెనుక చక్రాలు ఊడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును కంట్రోల్ చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బ‌స్సుకు ప్రమాదం జ‌రిగిన‌ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement