Sunday, April 28, 2024

Eluru: ఆయుధ పూజకు అధిక ప్రాముఖ్యత.. ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఆయుధ పూజకు అధిక ప్రాముఖ్యత ఉందని ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్ అన్నారు. దేవి శరన్నవరాత్రులు ముగింపు రోజైన విజయదశమి రోజు ఏలూరు జిల్లా ఏ.అర్ హెడ్ క్వార్టర్ నందు జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఆదేశాలపై ఆయుధ పూజా కార్యక్రమాన్ని ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్ ఆయుధ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ మాట్లాడుతూ… పురాణా కాలాల నుండి ఆయుధ పూజకి అతి ప్రాముఖ్యత కలిగినటువంటిదని, దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం అమ్మవారు కరుణా కటాక్ష విక్షణను జిల్లా ప్రజలపై ఉంచి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా పాడిపంటలతో పిల్లాపాపలతో కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా ఉండాలని ఏఅర్ అదనపు ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఅర్అర్ఐ పవన్ కుమార్, అర్ఎస్ఐ నరేంద్ర, ఏఅర్ఎస్ఐ కడలి శ్రీను, రవీంద్ర రాజేంద్ర వేంకటేశ్వర రావు, ఏఅర్ఎస్ఐ శెట్టి, డీడీ ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement