Friday, May 10, 2024

కంగ‌నా రానౌత్ కు అపూర్వ అవ‌కాశం… రావ‌ణ్ ద‌హ‌న్ చేయ‌నున్న బాలీవుడ్ బ్యూటీ

దసరా ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో ‘రావణ్ దహన్’ కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి చేస్తుంటారు. ఎన్నికలున్న నేపథ్యంలో ప్రధాని మోడీ బిజీగా ఉండ‌టంతో ఈ సారి రావణ్ దహన్‌ కార్యక్రమానికి రామ్ లీల కమిటీ కంగనాను ఆహ్వానించింది. దీంతో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆ ద‌హ‌న కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. 50 ఏళ్ల చరిత్రలో మొదటిసారి తొలిసారి ఓ మహిళా సెలబ్రిటీ ఈ కార్యక్రమానికి వెళ్లి రావణ దహనం చేయడం ఇదే తొలిసారి. ఈ కార్య‌క్ర‌మం నేటి రాత్రి జ‌ర‌గ‌నుంది..

రావణ్ దహన్‌ కార్యక్రమానికి కంగ‌నాతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ కంగనా ఓ ప్రత్యేక వీడియో విడుదల పోస్ట్‌ చేశారు. ’50 ఏళ్ల నుంచి వేడుక జరుగుతుంది. కానీ, రావణ్‌ దహన్‌ వేడుకను ఓ మహిళ చేయడం ఇదే తొలిసారి. ఆ అవకాశం నాకు లభించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement