Friday, May 3, 2024

NZB: ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం… సీపీ కల్మేశ్వర్

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కేంద్రంలో నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ ఆధ్వర్యంలో పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం పోలీసులు బోధన్ పట్టణంలోని సున్నిత ప్రాంతాల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. బోధన్ పట్టణంలోని పలు సున్నిత ప్రదేశాల్లో మార్చ్ ఫాస్ట్ నిర్వహించి బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

బీఎస్ఎఫ్ జవాన్లు 300మంది బోధన్ సబ్ డివిజన్ సిబ్బంది వంద మందికి మరి ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పట్టణంలో కనిపించడంతో ప్రజలందరూ ఏమైనా సంఘటన జరిగిందా అని పట్టణ ప్రజలంతా చర్చలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ జయరాం, ఏసీపీ కిరణ్ కుమార్, సీఐ ప్రేమ్ కుమార్, రూరల్ సీఐ శ్రీనివాసరాజు, రుద్రూర్ సీఐ జిఎస్ రెడ్డి, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement