Friday, April 26, 2024

స్వాతంత్ర్య దినోత్స‌వ ఏర్పాట్లు చేస్తుండ‌గా విద్యుత్ ఘాతంతో వ్య‌క్తి మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర్య దినోత్స‌వ ఏర్పాట్లు చేస్తుండ‌గా ఓ ఉద్యోగి ప్రమాదవాశాత్తు మృతి చెందాడు. జిల్లాలోని పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు గ్రామంలో సహకార సంఘం ఉద్యోగి టి.చిన్న వెంకటరెడ్డి (36) జెండా ఆవిష్కరణకు ఇనుప గొట్టాన్ని నిలబెడుతుండగా విద్యుత్తు వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గుర‌య్యాడు. వెంట‌నే స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement