Saturday, May 4, 2024

బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిలో జెండా ఎగ‌ర‌వేసిన బాల‌కృష్ణ‌

75వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆసుపత్రి ఛైర్మన్, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు, సినీ నటులు, నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న అందరికి శుభాకాంక్షలు తెలిపారు బాలకృష్ణ. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అందరిని స్మరించుకోవాల్సిన సమయం ఇది అని గుర్తు చేశారు. ప్రజలు పీల్చుకుంటున్న స్వేచ్ఛ వాయువులు ఎందరో త్యాగ ఫలితమని తెలిపారు.ఆయ‌న జెండాని ఎగ‌ర‌వేసిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement