Sunday, April 28, 2024

AP | జగన్ పాలనలో కరప్షన్ క్యాపిటల్‌గా రాష్ట్రం : పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ తణుకు ప్రజాగళం సభలో ప్రసంగం ప్రారంభించారు. బాపు వంటి ఒక గొప్పచిత్రకారుడు తణుకులో పుట్టారని వెల్లడించారు. నన్నయ యజ్ఞయాగాదాలు చేసి భారతానికి శ్రీకారం చుట్టిన నేల ఇది… ఇస్రో రాకెట్లకు ఇంధనం అందిస్తున్న నేల ఇది… ఎంతో పురోభివృద్ధి ఉన్న నేల ఇది… అలాంటి నేల వైసీపీ పాలనలో కరప్షన్ క్యాపిటల్ గా మారిపోయిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలు కలిసుండాలి, లేకపోతే రాష్ట్రం అన్యాయం అయిపోతుందని 2014 నుంచి చెబుతున్నాం. ఇవాళ చప్పట్లు కొట్టించుకోవడానికి ఇక్కడికి రాలేదు… మీకోసం మేం ఉన్నాం అని చెప్పడానికి వచ్చాం… మీ కోసం మేమెంతో తగ్గాం. చంద్రబాబు గారు ఎంతో తగ్గారు.. నేను కూడా తగ్గాను. ముఖ్యంగా జనసేన పార్టీ ఎంతో తగ్గింది. తణుకులో జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా మేం తగ్గాల్సి వచ్చింది… ఓటు చీలకూడదన్నదే ప్రధాన కారణం.

మా అన్నయ్య నాగబాబు అనకాపల్లి సీటును కూడా వదులుకున్నారు… ఇదంతా ఆడబిడ్డల భద్రత కోసం, రైతన్నల క్షేమం కోసం, కనీస వైద్య సదుపాయాల కోసం. దోపిడీ మీద దృష్టి ఉన్న వాడు ప్రజావసరాల గురించి ఏం పట్టించుకుంటాడు? చంద్రబాబుతో, ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చించి ఈ కూటమిని తీసుకువచ్చాం. నాకు అధికారం లేకపోయినా, చంద్రబాబుకు అధికారం లేకపోయినా మాకు నష్టం లేదు. కానీ జగన్ ఐదేళ్ల పాటు డీఎస్పీ ఇవ్వలేదు. అలాంటి పాలకులు అధికారంలో ఉంటే ఎవరికీ భవిష్యత్ ఉండదు” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement