Saturday, April 27, 2024

గడపగడపకు సంక్షేమ పథకాలు.. ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు స్టిక్క‌ర్లు..

యల్లనూరు ఏప్రిల్ 4 (ప్రభ న్యూస్) : యల్లనూరు మండలంలో రాష్ట్ర విద్యా సలహాదారుడు ఆలూరు సాంబశివరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని సచివాలయాలను సందర్శిస్తున్నారు. ఆయనతో పాటు జెడ్పిటిసి భోగతి విజయప్రతాప్ రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు గొడ్డుమర్రి ఈశ్వర్ రెడ్డి పలు గ్రామాల సర్పంచ్ లు రామాంజుల రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా 85 నిట్టూరు, పెద్దమల్లేపల్లి,
చిలమకూరు, యల్లనూరు వెన్నపూసపల్లి, గడ్డం వారిపల్లి సచివాలయలను సందర్శించి కన్వీనర్ లు,వాలంటీర్లు గృహసారదులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశానికి కొందరు వాలంటీర్లు గృహ సారదులు గైర్హాజరయ్యారు. ప్రభుత్వం చేస్తున్న మంచి సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వంచే ఆ కుటుంబ సభ్యులు పొందిన లబ్ది తదితర విషయాలతో చర్చించాలన్నారు. అలాగే లబ్ధిదారుల మొబైల్ ఫోన్ తో పాటు ఇంటి డోర్ కు స్టిక్కర్ లు అతికించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలు అందయా లేదా, పొంది ఉంటే ఆ కుటుంబ సభ్యులకు ఎంత మొత్తం లబ్ధి చేకూరింది.. అలాగే వారి అనుమతితో స్టిక్కర్ ను అతికించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రభుత్వ పార్టీ చేపట్టిన 8 అంశాలను లబ్ధిదారులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు, వైసిపి నాయకులు కన్వీనర్ లు వాలంటీర్లు, గృహ సారదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement