Tuesday, May 7, 2024

అమెరికాతో సై… శాటిలైట్స్ తో చైనా అణు యుద్ధ వ్యూహం…

న్యూఢిల్లి : అమెరికాను ఢీకొట్టేందుకు సై అంటున్న చైనా అందుకు తగ్గట్టుగా తన వ్యూహాలకు పదునుపెడుతోంది. అత్యాధునిక అస్త్రశస్త్రాలతో అగ్రరాజ్యంతో పోటాపోటీగా ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటున్న బీజింగ్‌, మరో అడుగు ముందుకేసి ప్రపంచాన్ని గుప్పిట పట్టేందుకు ప్రణాళి కలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో అంతరి క్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న బీజింగ్‌, అత్యంత రహస్యంగా భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందిస్తోందని అంతరిక్ష నిపుణులు అనుమానిస్తున్నారు. ఉపగ్రహాల ద్వారా ప్రపంచంపై కన్నేసి ఉంచే సరికొత్త వ్యూహానికి సిద్ధమవుతున్న సంకేతాలు వెల్లడవు తున్నాయి. అన్ని దేశాలపై ఉపగ్రహాలతో నిఘాను ముమ్మరం చేస్తోందని ప్రపంచ అంతరిక్ష రంగ నిపుణులు, రక్షణ రంగ పరిశోధకులు సందేహిస్తున్నారు. గడిచిన ఆర్నెల్లుగా చైనా చేపడుతున్న వరుస శాటిలైట్‌ ప్రయోగాల లక్ష్యాలను విశ్లేషిం చి, ఈ మేరకు డ్రాగన్‌ కుట్రలపై సందేహాలు లేవనెత్తుతున్నారు.

6 నెలలు.. 35 ఉపగ్రహాలు..
గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 ఉపగ్రహాలను చైనా ప్రయోగించింది. ఇవన్నీ తక్కువ ఆర్బిట్‌ శాటిలైట్లే. భూమికి సమీపంలో ఉండే కక్ష్యలోనే తిరుగుతుంటా యి. తద్వారా తాను అనుకున్న ప్రాంతంపై నిఘాపెట్టి, అక్కడి హైరిజల్యూషన్‌ చిత్రాలను సేకరించేందుకు ఈ శాటిలైట్లు ఉపకరిస్తాయి. ఇలా ఇప్పటి వరకు అంతరిక్షంలో చైనాకు చెందిన 400కు పైగా లో ఆర్బిట్‌ ఉపగ్రహాలు ప్రపంచ దేశాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

చెప్పేదొకటి.. చేస్తున్నదొకటి..
చైనాలో స్వేచ్ఛా మీడియా లేకపోవడం, ప్రభుత్వ మీడియా అన్ని విషయాలను వెల్లడించక పోవడం వల్ల అనేక విషయాలు బాహ్య ప్రపంచానికి తెలీకుండా ఉండిపోతున్నాయి. ప్రభు త్వం అధికారికంగా చెప్పిందే నిజమని భావించాల్సి వస్తుంది. లో ఆర్బిట్‌ శాటిలైట్ల విషయంలోనూ ఇదే జరుగుతోంది. తమ ప్రయోగాలు వ్యవసాయ పరిశోధనలు, ఇంటర్నెట్‌ సేవల కోసమేనని చైనా చెబుతున్నది. రక్షణ రంగ నిపుణులు మాత్రం, బీజింగ్‌ మాటల్ని విశ్వసించలేమని అంటున్నారు.
ప్రస్తుతం లో ఆర్బిట్‌లో మొత్తంగా 400కు పైగా ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. వీటిలో 347 ఉపగ్రహాలు చైనా సైన్యం పరిధిలోనివే కావడం విశేషం. ఉపగ్రహాలపై సైన్యం అజమా యిషీ ఉందంటే, కచ్చితంగా అవి నిఘా కోసం వినియోగిస్తున్న వేనని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భారత్‌, అమెరికా సహా పలు దేశాల్లో చైనా నిఘా బెలూన్లు కలకలం రేపిన ఉదంతాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నా రు. భవిష్యత్‌లో యుద్ధాలు సైనికబలంతో కాకుండా, అంతరిక్ష శక్తితో జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో చైనా వ్యూహాలు ప్రపంచానికి ముప్పేనని పేర్కొంటున్నారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. మొద ట ఉక్రెయిన్‌ ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిన రష్యా వాటిని పూర్తిగా ధ్వంసం చేసిందని వివరిస్తున్నారు. లో ఆర్బిట్‌ ఉపగ్ర హాలు అణు యుద్ధాల్లో కీలక భూమిక పోషిస్తాయని, ఇప్పుడు చైనా ఆ కోణంలోనే ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలను ప్రయో గిస్తోందని ఆరోపిస్తున్నారు.

అంతరిక్షరంగంలో అమెరికాను అధిగమించేలా చైనా ప్రణా ళికలు చేస్తోందని స్వయంగా పెంటగాన్‌ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది-2022′ స్పష్టం చేసింది. లేకుంటే.. అమెరికా గగనతలానికి ‘చైనా గ్రహణం’ పడుతుందని హచ్చరికలు చేసింది. 2045కల్లా చైనా అంతరిక్ష రంగాన్ని శాసిస్తుందని ఆ నివేదిక అంచనా వేసింది. తమదేశం నిర్వహించే 37జిపిఎస్‌ ఉపగ్రహాలతో పాటు అనేక వాణిజ్య, వాతావరణ ఉపగ్రహాలు, రక్షణ శాఖ పర్యవేక్షణా కార్యక్రమాల ద్వారా నిర్వహంచబడు తున్న అనేక ఉపగ్రహాలపై చైనా-రష్యా సైబర్‌ దాడులు చేసే ప్రమాదం ఉందని అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ అధికారులు తెలిపా రు. ఉక్రెయిన్‌తోపాటు ఇతర చోట్ల అణు క్షిపణి నియంత్రణతో సహా వాయు, భూ సైనిక కార్యకలాపాలను జిపిఎస్‌ శాటిలైట్ల ద్వారా అమెరికా నిరంతరం సమన్వయం చేస్తుంటుందని చెప్పారు. నివేదికల ప్రకారం, చైనాకు రోబోటిక్‌ చేయి అమర్చి న ఉపగ్రహం ఉంది. ఇది మరొక ఉపగ్రహాన్ని పంజాతో పట్టుకునే సామర్థ్యాన్ని కలిగివుంటుంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా అంతరిక్ష సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందుకోసం బడ్జెట్‌లో 25శాతం మేరకు బైడెన్‌ కేటాయింపులు పెెంచడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement