Friday, April 26, 2024

20లక్షలతో గెస్ట్ హౌస్ ని పూర్తి చేస్తాం కాకాణి గోవర్దన్ రెడ్డి..

మనుబోలు, (ప్రభన్యూస్) : ఏళ్ళ తరబడి అసంపూర్తిగా ఆగి వున్న గెస్ట్ హౌస్ ను 20 లక్షలతో పూర్తి చేస్తామని సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నిర్మాణంలో ఆగివున్న అతిధి గృహాన్ని ఆయన పరిశీలించారు. 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ హయాం నిర్మించిన గెస్ట్ హౌస్ నిధుల కొరతతో ఆసంపూర్ణంగా ఆగిపోయింది. మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన పట్టించు కోలేదు. నాయకులు ఆయన దృష్టి కి తీసుకొని పోయినారు.

దీనితో స్పందించి గోవర్దన్ రెడ్డి పరిశీలించి 20 లక్షల రూపాయాల వ్యయంతో ప్రతిపాదనలు పంపినారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగా పనులు ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యంపిపి వజ్రమ్మ, వైసిపినాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి. హరగోపాల్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డి, దాసరి బాస్కర్ గౌడ్, మహేంద్రవర్మ, రామిరెడ్డి పి ఆర్ డి ఈ చంద్ర శేఖర్ ఆచారీ తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement