Tuesday, May 7, 2024

నకిలీ విత్తనాలు కొని మోసపోయాం.. ఆదుకోండి..


క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పల్లవి సీడ్స్ దుకాణంలో నకిలీ మినుము విత్తనాలు ఎన్ ఎస్ సి T – 9 రకం కొని 50 ఎకరాల్లో వేసి రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులు త‌మ‌ను ఆదుకోవాల‌ని పట్టణంలో ఉన్న పల్లవి సీడ్ దుకాణం వద్ద ధర్నా చేపట్టారు. రైతులు ధర్నా చేస్తుండటంతో నందికొట్కూరు వ్యవసాయ అధికారిణి శ్రావణి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని, సీడ్స్ లాట్ కూడా పరిశీలిస్తామని, సెయిల్ టెస్టుకు పంపుతామని తెలిపారు. రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పల్లవి సీడ్స్ దుకాణం ఎదుట రైతులు, ప్రజా సంఘాల ధర్నా చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement