Sunday, May 5, 2024

వైసీపీలో విషాదం.. జడ్పీ వైస్ చైర్మన్ మృతి

వైసీపీలో విషాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందాడు. జిల్లా పరిషత్ లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పిటిసిగా గుర్తింపు పొందిన అంబటి అనిల్… సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడు అవుతారు. అనిల్ సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జడ్పి వైస్ చైర్మన్ మృతితో ఆయన కుటుంసభ్యులు విషాదంలో మునిగిపోయారు. అంబటి మృతిపై వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Huzurabad By election: టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం: కిషన్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement