Thursday, April 25, 2024

కొల్లాపూర్-పాన్ గల్ to హైదరాబాద్ కు బస్సు

పానుగల్ : మారుమూల గ్రామాల ప్రజల రవాణా సౌకర్యం కోసం కొల్లాపూర్ నుంచి పాన్‌గ‌ల్, వనపర్తి నుంచి ఆర్టీసీ బస్సును నడపడానికి మహబూబ్ నగర్ రీజినల్ మేనేజర్ ఉషాదేవి అంగీకరించారని జెడ్పీ కోఆప్టెడ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మునీరొద్దీన్ వెల్లడించారు.

శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాన్‌గ‌ల్‌, కోడేరు మండలాల్లోని పలు గ్రామాల నుండి వందలాది మంది ప్రజలు ప్రతిరోజు హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తార‌న్నారు. వీరికి నేరుగా బస్సు సౌకర్యం లేక వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని.. తాను చేసిన వినతి మేరకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సిఫార్సు లేఖను రీజినల్ మేనేజర్ కు అందజేశానని చెప్పారు. అందుకు స్పందించిన ఆర్ఎం పాన్ గల్ నుంచి హైదరాబాద్ కు బస్సు నడపడానికి ఏర్పాట్లు చేయాలని కొల్లాపూర్ డిపో మేనేజర్ ను ఆదేశించినట్లు మునీరొద్దీన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement