Friday, April 19, 2024

Huzurabad By election: టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం: కిషన్ రెడ్డి

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆరెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందన్న కిషన్ రెడ్డి.. హుజురాబాద్ ప్రజలు బీజేపీ పార్టీ వైపు ఉన్నారని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో మద్యం డబ్బు ఏరులై పరుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వారు బీజేపీ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం హుజురాబాద్ ఎన్నికల్లో సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టీఆరెస్ పార్టీపై ప్రజలలో వ్యతిరేకత ఎదురవుతోందన్న ఆయన.. టీఆరెస్ నాయకులు అనేక అబద్దాపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గులాబీ పార్టీకి ఓటు వేయని పక్షంలో ప్రజా సంక్షేమ పథకాలు నిలిపి వేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆరెస్ పార్టీ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందన్నారు. హుజురాబాద్ మహిళలు బీజేపీకి ఓటు తప్పకుండా వేస్తారన్నారు. మార్పు కోసం హుజురాబాద్ ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కిషన్ రెడ్డి కోరారు.

ఇది కూడా చదవండి: ఈ నెల 28న ఏపీ కేబినెట్ భేటీ

Advertisement

తాజా వార్తలు

Advertisement