Saturday, May 4, 2024

Vishakha – చంద్రన్నకు బాసటగా మత్స్యకారుల విన్నూత్న నిర‌స‌న ..

విశాఖ‌ప‌ట్నం – 19వ వార్డు పెద్ద జాలారిపేట లో కార్పొరేటర్ నొల్లి నుకరత్నం, బైరెడ్డి పోతన్న ఆధ్వర్యంలో చంద్ర‌బాబుకు బాసటగా మత్స్యకారులు సముద్రంలో బోట్లు పై వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ నొల్లి నుకరత్నం మాట్లాడుతూ మత్స్యకారులకు సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పాలన లోనే జరిగింన్నారు. హోసింగ్ నిర్మాణం, పట్టాల పంపిణీ కార్యక్రమాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం లోనే అమ‌ల‌య్యాయ‌య‌ని పేర్కొన్నారు. త‌మ ఎం.ఎల్.ఏ వెలగపూడి రామకృష్ణ బాబు ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం అని, అలాగే నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పై వచ్చేవరకు ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

జోన్1 మీడియా కో-ఆర్డినేటర్ బైరెడ్డి పోతన్న మాట్లాడుతూ వైస్సార్ ప్రభుత్వ నిరంకుశ విధానాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా, 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ని ఈ రకంగా అరెస్టు చేసి రిమాండ్ కి పంపడం ప్రజలు హర్షించడంలేదన్నారు. రాబోయే ఎన్నికలలో ఓట్లు రూపం లో వైస్సార్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకుడు జి. వి. రామచంద్రరావు , కార్పొరేటర్ నొల్లి నుకరత్నం, తెడ్డు రాజు, దోడ చిరంజీవి, పిల్లా నూకన్న, ఒలిశెట్టి చిన్న ఎల్లయ్య, ఒలిశెట్టి సత్యరావు, పొట్టి అప్పన్న, వాడమదుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement