Saturday, April 27, 2024

జ‌న‌సేన నాయ‌కుల అరెస్టులను ఖండిస్తున్నాం : నారా లోకేశ్‌

విశాఖ వైసీపీ రాజకీయ యాత్ర తుస్సుమంద‌ని.. ఆ ఉక్రోషంతోనే జనసేన నేతల అరెస్టులు చేశార‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విశాఖ విమానాశ్రయం ఘటన పేరుతో జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. అరెస్ట్ చేసిన జనసేన నేతలు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ గదులను తనిఖీ చేయడం, అక్కడున్న నాయకుల విషయంలో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. వైసీపీ చేప‌ట్టిన రాజ‌కీయ యాత్ర ఫెయిల్ అవ్వ‌డంతోనే ఈ విధ‌మైన చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని మండిప‌డ్డారు. అక్ర‌మంగా అరెస్టు చేసిన జ‌న‌సేన నేత‌ల‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement