Saturday, May 18, 2024

మానవత్వం చాటుకున్న రాంబిల్లి పోలీసులు…

.విశాఖపట్నం – ఖాకీ చాటున మానవత్వం ఎప్పుడూ ఉంటుందని మరోసారి నిరూపించారు పోలీస్ లు. ఢీ కంపోజ్ అయిన ఓ అనాథ శవాన్ని మోసుకు రావడమే కాకుండా భద్రంగా పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించారు. వివరాలలోకి వెళితే . రాంబిల్లి మండలం సీతంపాలెం సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన అనాథ శవం కొట్టుకు వచ్చింది. స్థానికులు పోలీసులకు ఈ సమాచారం ఇచ్చారు అక్కడికి వచ్చిన పోలీసులకు ఢీ కంపోజ్ అయిన మృత దేహం కనిపించింది. అక్కడ నుంచి దానిని తరలించేందుకు ఎ వరు ముందుకు రాలేదు దీంతో రాంబిల్లి పోలీసులు సుమారు మూడు కిలోమీటర్లు అనాథ శవాన్ని మోసి రోడ్ వద్దకు చేర్చారు. అక్కడి నుంచి భద్రంగా పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించి తమలో మానవత్వం ఉందని చాటుకున్నారు.

..

Advertisement

తాజా వార్తలు

Advertisement