Monday, May 6, 2024

Vizag : ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి… త‌ల్లి ఆత్మహ‌త్య ..

ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని విశాఖ‌ప‌ట్నం జిల్లా మ‌ద్దిల‌పాలెం కృష్ణా క‌ళాశాల స‌మీపంలో అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తల్లీ కూతురు మృతి చెందారు.

రెండ్రోజుల క్రితం తల్లి శైలజ ఆమె ఇద్దరు కుమార్తెలకు పురుగుల మందు ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. వారిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ తల్లి, చిన్న కూతురు ఈరోజు మృతి చెందారు. పెద్ద కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్తింటి వేధింపులు భరించలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని శైలజ తల్లి ఎంవీపీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement