Sunday, May 5, 2024

విశాఖలో డ్రగ్స్ కలకలం

విశాఖపట్నంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం కొండకర్ల దగ్గర డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఎండీఎం పిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. పోలీసుల అదుపులో తంగేటి భాస్కర్ సహా నలుగురు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలోనే విశాఖపట్నంలో ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండిఎం పిల్స్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement