Monday, April 29, 2024

విశాఖలో డ్రగ్స్‌ పట్టివేత

విశాఖ‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపింది. నగరంలోని పోర్ట్‌టౌన్‌ పీఎస్‌ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్స్‌, యాంటీ నార్కోటిక్స్ సెల్, లా అండ్‌ ఆర్డర్ పోలీసుల సంయుక్త దాడిలో పోలీసులు డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరివద్ద నుంచి 50ఎల్‌ఎస్డీ బ్లాట్స్‌ డ్రగ్స్‌ను పట్టుకుని సీజ్‌ చేశారు. నిందితులు క్రిఫ్టో కరెన్సీ ద్వారా బ్లాట్స్‌ డ్రగ్స్‌నుకొనుగోలు చేశారని వివరించారు. కేసులో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించామని , వారిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement